ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 221 పరుగుల లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ జోరుగా బ్యాటింగ్ చేస్తోంది. బెయిర్స్టోతో కలిసి ఓపెనర్గా వచ్చిన మనీశ్ పాండే బౌండరీలతో విజృంభిస్తున్నాడు. తొలి మూడు ఓవర్లను రైజర్స్ ఓపెనర్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. రాజస్థాన్ యువ పేసర్ కార్తీక్ త్యాగీ తన తొలి రెండు ఓవర్లలో కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు.
సకారియా వేసిన నాలుగో ఓవర్లో బెయిర్స్టో వరుసగా 6,4,4 బాది 16 రన్స్ రాబట్టాడు. త్యాగీ వేసిన ఐదో ఓవర్లో మనీశ్ రెండు సిక్సర్లు కొట్టి 16 పరుగులు సాధించాడు. దీంతో పవర్ప్లే ఆఖరికి సన్రైజర్స్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. బెయిర్స్టో(24), మనీశ్(31) సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.