న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా యువ పేసర్ నాథన్ ఎలీస్ను ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ జట్టులోకి తీసుకుంది. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్-14వ సీజన్ రెండో దశలో అతడు పంజాబ్ తరఫున బరిలో దిగుతాడని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. రిలే మెరెడిత్, కేన్ రిచర్డ్సన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో.. రిప్లేస్మెంట్లో ఎలీస్ను ఎంపిక చేసుకున్నట్లు ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. ‘ఆసీస్ సంచలనం నాథన్ ఎలీస్ పంజాబ్ తరఫున ఆడనున్నాడు. క్వారంటైన్ పూర్తైన అనంతరం అతడు జట్టుతో చేరుతాడు’ అని పేర్కొంది. బిగ్ బాష్ లీగ్లో సత్తా చాటిన ఎలీస్.. ఇటీవల బంగ్లాదేశ్తో అరంగేట్ర టీ20లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. చక్కటి వేగంతో పాటు బంతిని స్వింగ్ చేయగల సత్తా ఉన్న ఎలీస్.. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు.