బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ 2022
బీజింగ్: వచ్చే ఏడాది చైనా వేదికగా జరుగనున్న వింటర్ ఒలింపిక్స్కు విదేశీ ప్రేక్షకులను అనుమతించబోమని నిర్వాహకులు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకోని అథ్లెట్లకు 21 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. మెగాటోర్నీ సమయంలో ప్రతిరోజూ అథ్లెట్లకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) గురువారం బీజింగ్ వింటర్ ఒలింపిక్స్-2022 మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోకున్నైట్లెతే వారు 21 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిందే. మెగాటోర్నీని ప్రత్యక్షంగా వీక్షించేందుకు విదేశీయులకు అనుమతి లేదు’అని ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది.