న్యూఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) రోజువారీ కార్యకలాపాల కోసం భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో భూపిందర్సింగ్ బాజ్వా, ఎమ్ఎమ్ సోమయ, మాజీ షట్లర్ మంజుష కన్వర్ ఉన్నారు.
అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) నిబంధనలకు విరుద్ధంగా టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధమైనందువల్లే డబ్ల్యూఎఫ్ఐని రద్దు చేశామని ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.