కేపీహెచ్బీ కాలనీ: థాయ్లాండ్లోని పట్టాయలో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్, గ్రేటా స్పోర్ట్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఎమ్టీ-400 సీనియర్ వరల్డ్ టెన్నిస్ టోర్నమెంట్ 2023లో రాష్ర్టానికి చెందిన కొత్వాల వెంకటనారాయణ మూర్తి డబుల్స్ విజేతగా నిలిచాడు. 45 సంవత్సరాల విభాగంలో వెంకటనారాయణ మూర్తి, అమిత్ అంక్నాథ్ అహేర్(మహారాష్ట్ర)జోడీ ఫైనల్లో చైనా ద్వయం లూయీవింగ్, హోన్జియావోను ఓడించి టైటిల్ విన్నర్గా నిలిచింది. అలాగే 50 సంవత్సరాలు పైబడిన విభాగంలో కుమార్ రాజన్నిర్మల్ జతగా మూర్తి రన్నరప్ టైటిల్ దక్కించుకున్నాడు.