ఖైరతాబాద్, జనవరి 10: ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్ షిప్ లీగ్ పోటీలు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగనున్నాయి. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోటీల నిర్వహకులు, ప్రముఖ మెజీషియన్ సామల వేణు పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ 15 దేశాల నుంచి టీమ్లు వస్తున్నాయని, ఒక టీమ్లో ఐదుగురు ప్లేయర్లు ఉంటారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రము ఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీకృష్ణ చాముండేశ్వర మహార్షి, అబ్దుల్లా గ్రూపు ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అబ్దుల్లా, కవితా శ్రీనివాసన్ పాల్గొంటారని అన్నారు.