హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైసియా ఇంటర్ కార్పొరేట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ 25వ సీజన్లో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జట్లు ఓవరాల్ చాంపియన్లుగా నిలిచాయి. నగరంలోని 60కి పైగా ప్రముఖ ఐటీ, జీసీసీ కంపెనీల నుంచి 270 జట్ల 17 క్రీడాల్లో పోటీపడ్డ ఈ మెగా ఈవెంట్లో ్ల ఇన్ఫోసిస్, టీసీఎస్ జట్లు చెరో ఐదు ట్రోఫీలు,11 పోడియం ఫినిష్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి.
బ్యాడ్మింటన్, టీటీ, క్యారమ్స్, స్క్వాష్, మెన్స్ బాక్స్ క్రికెట్ విభాగాల్లో ఇన్ఫోసిస్ చాంపియన్గా నిలవగా.. చెస్, కబడ్డీ, మెన్స్ వాలీబాల్, స్నూకర్, విమెన్స్ త్రోబాల్ ఈవెంట్లలో టీసీఎస్ ట్రోఫీలు కైవసం చేసుకుంది. అత్యధికంగా 55 జట్లు పోటీపడ్డ మెన్స్ ఫీల్డ్ క్రికెట్ ట్రోఫీని డెలాయిట్ నెగ్గింది.