INDWvsENGW 1st Test: భారత్-ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 428 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 136 పరుగులకే కట్టడి చేసింది. ఆ జట్టులో నటాలి సీవర్ బ్రంట్ (70 బంతుల్లో 59, 10 ఫోర్లు) మినహా మిగిలినవారంతా విఫలమవ్వడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ దీప్తి శర్మ ఐదు ఓవర్లు మాత్రమే వేసి నాలుగు మెయిడిన్లు చేసి ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ కథ ముగించింది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసిన భారత్.. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరుకు 18 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్కు వచ్చిన భారత్.. ఇంగ్లండ్ను ఆది నుంచే నిలువరించింది. ఓపెనర్ బ్యూమంట్ (10), డంక్లీ (11)లతో పాటు కెప్టెన్ హీథర్ నైట్ (11) కూడా విఫలమయ్యారు.
5⃣.3⃣ Overs
4⃣ Maidens
7⃣ Runs
5⃣ WicketsDeepti Sharma was absolute MAGIC 🪄 🪄
Follow the Match ▶️ https://t.co/UB89NFaqaJ #TeamIndia | #INDvENG | @Deepti_Sharma06 | @IDFCFIRSTBank pic.twitter.com/cGNG4YaKeV
— BCCI Women (@BCCIWomen) December 15, 2023
నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సీవర్.. కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా స్నేహ్రాణా, దీప్తి శర్మ ఎంట్రీతో ఇంగ్లండ్ ఖేల్ కతమైంది. డానియల్ వ్యాట్ (19)ను 26వ ఓవర్లో రెండో బంతికి ఔట్ చేసిన దీప్తి.. ఆ తర్వాత అమీ జోన్స్ (12), ఎకిల్స్టోన్ (0)లను వరుస ఓవర్లలో ఔట్ చేసింది. అర్థ సెంచరీ చేసిన సీవర్ను స్నేహ్ రాణా.. 30 వ ఓవర్లో మూడో బంతికి బౌల్డ్ చేసింది. ఆ తర్వాత దీప్తి.. , కేట్ క్రాస్ (1), లారెన్ ఫైలర్ (5) లు కూడా ఔట్ అవడంతో ఇంగ్లండ్.. 35.3 ఓవర్లలో ఆలౌట్ అయింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 292 పరుగుల ఆధిక్యం దక్కింది. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా పూజా వస్త్రకార్, రేణుకా సింగ్ ఠాకూర్లు తలా ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో ఐదు ఓవర్లు ముగిసేటప్పటికీ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 316 పరుగుల ఆధిక్యం సాధించింది.