INDvsSA 2nd ODI: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు నేడు ఆతిథ్య జట్టుతో రెండో వన్డే ఆడుతున్నది. ఇదివరకే తొలి మ్యాచ్ గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టు నేటి మ్యాచ్లో గెలిచి వన్డే సిరీస్ను చేజిక్కించుకునేందుకు రంగంలో దిగుతున్నది. సెయింట్ జార్జెస్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా టీ20 నయా ఫినిషర్ రింకూ సింగ్ వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు.
దక్షిణాఫ్రికా తరఫున రెండు మార్పులు జరిగాయి. బీరున్, లిజాడ్లు తుది జట్టులోకి వచ్చారు. తొలి మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యంతో 116 పరుగులకే ఆలౌట్ అయి తీవ్ర అవమనాకర ఓటమిని మూటగట్టుకున్న దక్షిణాఫ్రికా నేటి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తున్నది. సౌతాఫ్రికాలో అత్యంత నెమ్మదైన పిచ్ ఇదే కావడంతో బౌలర్లు మరోసారి ఆధిపత్యం చెలాయించే అవకాశముంది.
తుది జట్లుః
భారత్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్
దక్షిణాఫ్రికా: టోని డి జార్జి, రీజా హెండ్రిక్స్, రస్సీ వాండర్ డసెన్, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, కేశవ్ మహారాజ్, నండ్రె బర్గర్, లిజాడ్ విలియమ్స్, బెరూన్ హెండ్రిక్స్