Virat Kohli: రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ వాంఖడేలో నెలకొల్పిన 50వ శతకంతో మరికొన్ని రికార్డులనూ తుడిచేశాడు. సుదీర్ఘకాలంగా అటకెక్కిన చరిత్ర పుస్తకాల దుమ్మును దులిపేస్తూ వాంఖడేలో కొత్త చరిత్ర లిఖించాడు. వన్డే వరల్డ్ కప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో సచిన్.. వన్డేలలో నెలకొల్పిన 49 శతకాల రికార్డుతో పాటు ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డునూ బ్రేక్ చేశాడు. సెంచరీల అర్థ సెంచరీతో నయా చరిత్ర లిఖించిన విరాట్ ఈ మ్యాచ్లో సాధించిన రికార్డుల జాబితాను ఇక్కడ చూద్దాం.
సచిన్ రికార్డు బ్రేక్..
వన్డేలలో కోహ్లీకి ఇది 50వ సెంచరీ. 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న తొలి బ్యాటర్ కోహ్లీ. 49 సెంచరీలు చేయడానికి 462 ఇన్నింగ్స్ తీసుకుంటే కోహ్లీ 279 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనత అందుకున్నాడు. సచిన్ మాదిరిగానే కోహ్లీ 50 శతకాల రికార్డుకూ ఇప్పట్లో వచ్చిన ప్రమాదమేమీ లేదు. ప్రస్తుతం యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీకి దరిదాపుల్లో ఉన్న క్రికెటర్ లేడు. వన్డేలలో కోహ్లీ, సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ రోహిత్ శర్మ (31) మాత్రమే.
సెంచరీలతో పాటు వన్డే వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డునూ విరాట్ బ్రేక్ చేశాడు. 2003 ప్రపంచకప్లో సచిన్..11 మ్యాచ్లలో 673 పరుగులు చేయగా తాజాగా కోహ్లీ 10 మ్యాచ్లలోనే 711 పరుగులు చేసి ప్రపంచకప్లో 700 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. కోహ్లీ, సచిన్ తర్వాత ఈ జాబితాలో మాథ్యూ హెడెన్ (673- 2007లో) రోహిత్ శర్మ (648 – 2019 లో), డేవిడ్ వార్నర్ (647 – 2019లో) ఉన్నారు.
1st ODI hundred on 2009 & 50th ODI hundred on 2023.
– What a journey. 🐐 pic.twitter.com/l7BNZlmBLp
— Johns. (@CricCrazyJohns) November 15, 2023
మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు..
ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధికంగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లలో కూడా కోహ్లీ ముందున్నాడు. 2003లో సచిన్.. ఏడు సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేయగా తాజా సెంచరీతో కోహ్లీ దానినీ అధిగమించాడు. ఈ జాబితాలో షకిబ్ అల్ హసన్ (7), రోహిత్ శర్మ (6), డేవిడ్ వార్నర్ (6) లు తదుపరి స్థానాల్లో ఉన్నారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన వారిలో కోహ్లీ.. కుమార సంగక్కర రికార్డును అధిగమించాడు. సంగక్కర.. 216 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేయగా కోహ్లీ తాజాగా దానిని అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ (264) అగ్రస్థానంలో ఉండగా రికీపాంటింగ్ కూడా కోహ్లీతో సమానంగా ఉన్నాడు.
వన్డేలలో అత్యధిక పరుగులు..
వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్, కుమార సంగక్కర తర్వాత కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో నేటి మ్యాచ్ కంటే ముందు కోహ్లీ కంటే ముందున్న రికీ పాంటింగ్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ (18,426), సంగక్కర (14,234), కోహ్లీ (13,794), రికీ పాంటింగ్ (13,704) , జయసూర్య (13,430) లు టాప్-5లో ఉన్నారు.