INDvsNZ: భారత్తో ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న తొలి సెమీస్లో టీమిండియా నిర్దేశించిన 398 పరుగుల ఛేదనలో కివీస్ తడబడుతోంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఈ టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అదరగొడుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీ.. ఓపెనర్ల పనిపట్టాడు. డెవాన్ కాన్వే (15 బంతుల్లో 13, 3 ఫోర్లు), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 13, 3 ఫోర్లు)లను వెనక్కి పంపి కివీస్ను ఆదిలోనే దెబ్బతీశాడు.
భారీ ఛేదనలో భాగంగా బ్యాటింగ్కు వచ్చిన కివీస్.. ఆరంభం నుంచే ధాటిగా ఆడాలని చూసింది. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే కాన్వే రెండు బౌండరీలు కొట్టాడు. తర్వాత సిరాజ్, బుమ్రాల ఓవర్లలో కాన్వే, రచిన్లు తలా ఓ ఫోర్ బాదారు. ఐదు ఓవర్లలో 30 పరుగులు చేసిన షమీ షాకిచ్చాడు. ఆరో ఓవర్లో తొలి బంతికే కాన్వే.. వికెట్ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చాడు. తన తదుపరి ఓవర్లలో షమీ.. రవీంద్రనూ పెవిలియన్కు పంపాడు. రవీంద్ర కూడా రాహుల్కే క్యాచ్ ఇచ్చాడు. పది ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (4 నాటౌట్), డారెల్ మిచెల్ (1 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.