INDvsAUS T20I: భారత్ – ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్లో తేలిపోయింది. శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 53, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ సెంచరీతో రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పాటు పరుగులను కట్టడి చేయడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన భారత్ ఇన్నింగ్స్ను ధాటిగానే ఆరంభించింది. జైస్వాల్ (15 బంతుల్లో 21, 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో ఇండియా మూడు ఓవర్లలోనే 33 పరుగులు చేసింది. అప్పట్నుంచి భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ (10)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5), నయా ఫినిషర్ రింకూ సింగ్ (6)లు విఫలమయ్యారు.
రింకూ స్థానంలో వచ్చిన జితేశ్ శర్మ (16 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్స్) తో పాటు అక్షర్ పటేల్ (21 బంతుల్లో 31, 2 ఫోర్లు, 1 సిక్సర్) లు రాణించడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో బెరెన్డార్ఫ్, డ్వాషిస్ లు తలా రెండు వికెట్లు తీయగా ఆరోన్ హార్ఢీ, నాథన్ ఎల్లిస్, సంఘాలు చెరో వికెట్ పడగొట్టారు.