INDvsAUS: భారత్ – ఆస్ట్రేలియా మధ్య బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ నెగ్గింది. ఆసీస్ సారథి మాథ్యూ వేడ్ మరోసారి బౌలింగ్కే మొగ్గు చూపడంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇదివరకే సిరీస్ను 3-1 తేడాతో గెలుచుకున్న భారత్.. నామమాత్రపు పోరు అయినప్పటికీ విజయం సాధించి ప్రపంచకప్లో భారత ఓటమికి కాస్తైనా బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. ఈ మ్యాచ్లో భారత్, ఆసీస్లు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.
భారత్ నుంచి గత మ్యాచ్లో ఆడిన దీపక్ చాహర్ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో అతడి స్థానంలో అర్ష్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఆసీస్ టీమ్లో గ్రీన్కు బదులు ఎల్లిస్ ఫైనల్ లెవన్లో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఈ మ్యాచ్లో అయినా గెలిచి భారత ఆధిక్యాన్ని తగ్గించాలని చూస్తున్నది.
తుది జట్లుః
ఇండియాః యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్దీప్ సింగ్
ఆస్ట్రేలియాః ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్పి, బెన్ మెక్డెర్మెట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్ (కెప్టెన్) బెన్ డ్వాషిస్, నాథన్ ఎల్లిస్, జేసన్ బెరెన్డార్ఫ్, తన్వీర్ సంఘా