జకార్తా: ఇండోనేషియా మాస్టర్స్లో భారత షట్లర్లు నిరాశ పరిచారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ క్వార్టర్స్లోనే వెనుదిరిగారు. ఫలితంగా ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 16-21, 21-12, 14-21తో చోయ్ టైన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడగా.. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో పీవీ సింధు 12-21, 10-21తో రచనోక్ ఇంతనోన్ (థాయ్లాండ్) చేతిలో వరుస గేమ్ల్లో పరాజయం పాలైంది. అరగంటలోనే ముగిసిన పోరులో సింధు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. గత నెల థాయ్లాండ్ ఓపెన్ సెమీస్లో వెనుదిరిగిన సింధు.. ఈ సారి క్వార్టర్స్తో పోరాటం ముగించింది.