పోచెఫ్స్ట్రోమ్ (దక్షిణాఫ్రికా): బౌలర్లు సత్తాచాటడంతో అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ సూపర్ సిక్స్లో భారత్ ఘనవిజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో మన అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నస్టానికి 59 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో పర్షవి చోప్రా 4 వికెట్లతో అదరగొట్టింది. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం ఐదు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి లంకేయులను చావుదెబ్బతీసింది. మన్నత్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకుంది. అనంతరం యంగ్ఇండియా స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. మనవాళ్లు 7.2 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులు చేసి గెలిచారు. సౌమ్య తివారి (28 నాటౌట్), షఫాలీ వర్మ (15) రాణించారు. పర్షవికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.