Mirabai Chanu | పుకెట్: భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను..ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో థాయ్లాండ్లోని పుకెట్ వేదికగా జరుగుతున్న వరల్డ్కప్లో మీరాబాయి చాను మూడో స్థానంలో నిలిచింది. సోమవారం ముగిసిన గ్రూప్-బీ మహిళల 49 కిలోల విభాగంలో పోటీపడ్డ ఆమె.. 184 కిలోల (81 స్నాచ్ + 103 క్లీన్ అండ్ జెర్క్) బరువు ఎత్తింది.
మూడో స్థానంలో నిలవడంతో ఈ ఏడాది ఆగస్టులో జరుగబోయే పారిస్ ఒలింపిక్స్లో ఆమె బెర్త్ను ఖాయం చేసుకుంది. విశ్వక్రీడలలో పాల్గొనాలంటే పుకెట్లో జరుగుతున్న ఈవెంటే చివరిది కావడంతో ఆరు నెలల విరామం తర్వాత చాను వరల్డ్కప్లో బరిలోకి దిగింది. ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ కప్ ముగిశాక టాప్-10లో ఉన్నవారికి ఒలింపిక్స్ బెర్త్ దక్కనుంది.