సార్బ్రూకెన్ (జర్మనీ): భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి హైలో ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట 22-24, 21-15, 21-11తో రోరి ఈస్టన్-జాక్ రస్ (ఇంగ్లండ్) ద్వయంపై విజయం సాధించింది. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి-త్రిసా జాలి జోడీ 21-18, 21-19తో డెబొర జిల్లె-చెరిల్ సీనెన్ జంటపై గెలిచింది. మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్తో పాటు.. మహిళల డబుల్స్లో రుతుపర్ణ-శ్వేతపర్ణ పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.