US Open 2023 | న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్.. యూఎస్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. అమెరికా వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-15, 21-12తో దీక్షపై విజయం సాధించింది.
27 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం కనబర్చింది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ 21-11, 21-16తో నుయేన్పై గెలిచాడు. మరో భారత షట్లర్ సాయి ప్రణీత్ తొలి రౌండ్లో 21-16, 14-21, 19-21తో రెండో సీడ్ షి ఫెంగ్ చేతిలో ఓడాడు.