జకార్తా: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. ఇండోనేషియా ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీలో ప్రణయ్తో పాటు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట సెమీస్లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం ప్రణయ్ 21-18, 21-16తో మూడో సీడ్ కొడాయ్ నరోకా (జపాన్)పై విజయం సాధించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 21-14, 14-21, 12-21తో లి షి ఫెంగ్ (చైనా)చేతిలో ఓటమి పాలయ్యాడు.
గంటకు పైగా సాగిన పోరులో శ్రీకాంత్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్ జంట 21-13, 21-13తో ఫజర్-రియాన్ (ఇండోనేషియా) ద్వయంపై విజయం సాధించింది. శనివారం జరుగనున్న సింగిల్స్ సెమీస్లో టాప్సీడ్ విక్టర్ అక్సెల్సన్తో ప్రణయ్ తలపడనున్నాడు.