కౌలాలంపూర్ : భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మలేసియా ఓపెన్ టోర్నీ క్వార్టర్ఫైనల్కు చేరుకున్నాడు. గురువారం జరిగిన పోరులో ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్ 21-9, 15-21, 21-16తో గంట నాలుగు నిమిషాలలో ఇండోనీసియాకు చెందిన చికొ అవురాపై విజయం సాధించాడు. ప్రణయ్ తదుపరి మ్యాచ్లో మలేసియాకు చెందిన ఎంగ్ ట్జె యాంగ్, జపాన్కు చెందిన కొదై నరఒకల మధ్య విజేతతో తలపడతాడు. పురుషుల డబుల్స్లో ప్రపంచ 5 ర్యాంక్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్స్లో ప్రవేశించారు.
భారత జోడి గురువారం 21-19, 22-20తో ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రి-బగాస్ మౌలానలపై 49 నిమిషాలలో విజయం నమోదు చేశారు. అంతకుముందు కామన్వెల్త్ క్రీడల కాస్ంయ పతక మహిళల జోడి గాయత్రి గోపీచంద్-త్రిసా జాలి ప్రిక్వార్టర్స్లో 13-21, 21-15, 17-21తో పోరాడి ఓడారు.