న్యూఢిల్లీ: డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా సంచలన ప్రదర్శన నమోదు చేసింది. స్లొవేనియాలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ మనిక 3-0 (11-4, 11-9, 11-7)తో వరల్డ్ 15వ ర్యాంకర్ చెన్ ఐ చింగ్పై గెలిచి ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లింది.