న్యూఢిల్లీ: వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా దూసుకొచ్చాడు. మంగళవారం కుదించిన జాబితాలో నీరజ్ చోటు దక్కించుకున్నాడు. ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం ఐదుగురు అథ్లెట్లతో కలిసి పోటీపడుతున్నాడు. నీరజ్ ఈ మధ్య కాలంలో నిలకడగా రాణిస్తూ ప్రతిష్ఠాత్మక టైటిళ్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
ఇటీవల ఆసియాగేమ్స్తో పాటు వరల్డ్ అథ్లెటిక్స్ టోర్నీ, డైమండ్ లీగ్, కామన్వెల్త్ గేమ్స్లో సత్తాచాటుతున్నాడు. రానున్న పారిస్ ఒలింపిక్స్లోనూ పతకం గెలువాలన్న పట్టుదలతో ఉన్నాడు. అవార్డు రేసులో నీరజ్తో పాటు ర్యాన్ క్రౌజర్(అమెరికా), మోండో డుప్లాంటిస్(స్వీడన్), కెల్విన్ కిప్టమ్(కెన్యా), నోహ్ లైస్(అమెరికా) ఉన్నారు.