జకార్తా: హాకీ ఆసియా కప్ సూపర్-4లో భారత్ తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో భారత్ 2-1తో జపాన్పై విజయం సాధించింది. తద్వారా లీగ్ దశలో జపాన్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమ్ఇండియా బదులు తీర్చుకుంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ తరఫున మన్జీత్ (8వ నిమిషంలో), పవన్ (35వ ని.లో) ఒక్కో గోల్ సాధించగా.. జపాన్ తరఫున తకుమా నీవా (18వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభమైన తొలి నిమిషంలోనే జపాన్కు పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కగా.. మన డిఫెండర్లు దాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు.