చెంగ్డు: ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్లో భారత్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత ద్వయం ఎలావెనిల్ వాలరివన్, దివ్యాంశ్సింగ్ పన్వార్ రజత పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో వాలరివాన్ 13-17తో చైనీస్ జోడీ యుజాంగ్, బుహన్ సాంగ్ చేతిలో ఓటమిపాలై రెండో స్థానంలో నిలిచింది.
మరోవైపు మహిళల లాంగ్జంప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన భవానీ యాదవ్ 6.32 మీటర్ల దూరంతో రజత పతకాన్ని ఒడిసిపట్టుకుంది.భారత్ ప్రస్తుతం 11 స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్యాలతో నాలుగో స్థానంలోఉంది.