దోహా: ఏఎఫ్సీ ఆసియా కప్లో భారత్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. గురువారం జరిగిన గ్రూపు-బీ లీగ్ మ్యాచ్లో భారత్ 0-3తో ఉజ్బెకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. గత మ్యాచ్లో ఆసీస్పై అద్భుత పోరాట పటిమ కనబరిచిన టీమ్ఇండియా..ఉజ్బెకిస్థాన్పై చేష్టలుడిగిపోయింది. ఉజ్బెకిస్థాన్ తరఫున ఫజయుల్లెవ్(4ని), ఇగోర్ సెర్గీవ్(18ని), నస్రుల్లెవ్(45ని) గోల్స్ చేశారు. ఈ నెల 23న సిరియాతో భారత్ తలపడుతుంది.