న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ కొరియా ఓపెన్లో శుభారంభం చేశాడు. ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తున్న లక్ష్యసేన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో ప్రిక్వార్టర్స్కు చేరాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ లక్ష్యసేన్ 14-21, 21-16, 21-18తో ప్రపంచ 25వ ర్యాంకర్ లూ గ్వాంగ్ జు (చైనా)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్ 20-22, 22-20, 21-10తో హాన్ యూ (చైనా)పై గెలుపొందింది. పురుషుల విభాగంలో హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి పాలవగా.. డబుల్స్లో కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్ జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.