లీసెస్టర్: భారత్, లీసెస్టర్షైర్ వామప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నది. గురువారం మొదలైన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టీమ్ఇండియా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 8 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.
అంతకుముందు లిసెస్టర్షైర్ యువ బౌలర్ రోమన్ వాల్కర్(5/24) ధాటికి టీమ్ఇండియా టాపార్డర్ ఘోరంగా తడబడింది. ఈ తరుణంలో విరాట్ కోహ్లీ(33), శ్రీకర్ భరత్(70 నాటౌట్) ఇన్నింగ్స్ను నిలబెట్టారు. జాతీయ జట్టులో చోటు కోసం వేచిచూస్తున్న భరత్ తనకు లభించిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.