Sahaja Yamalapalli | గురుగ్రామ్: భారత యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ ఐటీఎఫ్ మహిళల ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 7-6 (10/8), 7-5తో భారత్కే చెందిన రియా భాటియాపై విజయం సాధించింది. తొలి సెట్లో ఇరువురు ప్లేయర్లు హోరాహోరీగా పోరాడగా.. టై బ్రేకర్లో సహజ ముందడుగు వేసింది. ఇక రెండో సెట్ ఆరంభం నుంచే పకడ్బందీ షాట్లతో విరుచుకుపడిన సహజ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోమ్యాచ్లో భారత టాప్ ర్యాకర్ అంకిత రైనా కూడా గెలిచి క్వార్టర్స్కు చేరింది.