Sahaja Yamalapalli | గురుగ్రామ్: భారత యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ ఐటీఎఫ్ మహిళల ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సహజ 6-4, 6-2తో కోషిషి (జపాన్)పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే చక్కటి షాట్లతో విజృంభించిన సహజ వరుస సెట్లలో జపాన్ ప్లేయర్ను మట్టికరిపించింది.
నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించిన సహజ మూడు డబుల్ ఫాల్ట్స్ చేయగా.. నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేసిన ప్రత్యర్థి మూల్యం చెల్లించుకుంది. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్స్లో రియాతో సహజ అమీతుమీ తేల్చుకోనుంది.