న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ మూడో ఐటీఎఫ్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన కలబుర్గీ ఓపెన్లో రామ్కుమార్ విజేతగా నిలిచాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రామ్కుమార్ 6-2, 6-1తో డేవిడ్ పిచ్లెర్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. 64 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో రామ్కుమార్ వరుస సెట్లలో విజృంభించాడు. గత రెండు నెలల్లో రామ్కుమార్కు ఇది మూడో ఐటీఎఫ్ టైటిల్ కావడం విశేషం.