హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత యువ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయి కార్తీక్ రెడ్డి.. 15కే ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ డబుల్స్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. జకార్తా వేదికగా జరిగిన టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో తెలంగాణ ప్లేయర్ కార్తీక్-సిద్ధాంత్ జోడీ 6-7 (3/7), 7-5, 10-5తో ఫుకుడా సొరా-టొమోహిరో (జపాన్) ద్వయంపై విజయం సాధించింది.
తొలి సెట్లో చివరి వరకు పోరాడి ఓడిన కార్తీక్ జంట.. ఆ తర్వాత విజృంభించింది. ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా వెనక్కి తగ్గకుండా.. కీలక సమయాల్లో పాయింట్లు కొల్లగొట్టి విజేతగా నిలిచింది.