లండన్: ఆల్ ఇంగ్లండ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత యువ షట్లర్ రక్ష కందస్వామి రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రక్ష 21-19, 12-21, 11-21తో జాకీ డెంట్(కెనడా) చేతిలో ఓటమిపాలైంది.
ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన తుది పోరులో తొలి గేమ్ గెలుచుకున్న రక్ష..అదే జోరును కొనసాగించడంలో విఫలమై రన్నరప్తో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్, సెమీస్లో ఈ యువ షట్లర్ అద్భుత ప్రతిభ కనబరిచింది.