Lakshya Sen | బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్లో సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21-12, 10-21, 15-21తో జొనాథాన్ క్రిస్టి(ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలయ్యాడు.
2022లో రన్నరప్గా నిలిచిన లక్ష్యసేన్..మరోమారు ఫైనల్లోకి దూసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. గత వారం ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్కు చేరుకున్న లక్ష్యసేన్ 11 రోజులుగా విరామం లేకుండా ఆడుతున్నాడు.