Ashmita Chaliha | బ్యాంకాక్: భారత యువ షట్లర్ అశ్మిత చలిహ.. థాయ్లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో శుక్రవారం అశ్మిత 21-14, 19-21, 21-13తో ఎస్తెర్ నురుమి (ఇండోనేషియా)పై విజయం సాధించింది.
గంట పాటు సాగిన పోరులో అశ్మిత చక్కటి ప్రదర్శన కనబర్చగా.. పురుషుల సింగిల్స్లో మిథున్ మంజునాథన్, మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్ సెమీస్లో నాలుగో సీడ్ కటేటాంగ్తో అశ్మిత అమీతుమీ తేల్చుకోనుంది.