న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ ఆకర్షి కశ్యప్.. ఉగాండా ఇంటర్నెషనల్ చాలెంజ్ ట్రోఫీ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆకర్షి 25-23, 21-18తో భారత్కే చెందిన శృతిపై విజయం సాధించింది. 48 నిమిషాల పాటు సాగిన పోరు తొలి గేమ్లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా.. కీలక పాయింట్లు సాధించి ముందంజ వేసిన ఆకర్షి.. రెండో గేమ్లోనూ అదే జోరు కొనసాగిస్తూ టైటిల్ ఖాతాలో వేసుకుంది.