బుసాన్(దక్షిణకొరియా): ప్రతిష్ఠాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్షిప్లో భారత యువ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనతో విజృంభించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్లో శ్రీజ 11-7, 11-9, 13-11తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ యిడి పై అద్భుత విజయం సాధించింది.