హైదరాబాద్, ఆట ప్రతినిధి: జకార్తా (ఇండోనేషియా) వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో భారత యువ ద్వయం సాయికార్తీక్రెడ్డి, సిద్దార్థ్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లారు.
బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో కార్తీక్, సిద్దార్థ్ జోడీ 6-1, 7-6 తేడాతో ఫెర్గుసన్, వుజిక్ ద్వయంపై అద్భుత విజయం సాధించింది.