అస్తానా(కజకిస్థాన్): ఎల్రోడా బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ విజయ్కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన 60కిలోల క్వార్టర్స్ బౌట్లో విజయ్కుమార్ 3-2 తేడాతో జోల్దాస్ జెనిసోవ్(కజకిస్థాన్)పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో విజయ్కుమార్ పవర్పంచ్లతో ఆకట్టుకున్నాడు.
ఓవైపు ప్రత్యర్థి నుంచి దీటైన పోటీ ఎదురవుతున్నా వెనుకకు తగ్గకుండా రౌండ్ రౌండ్కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయాడు. శనివారం జరిగే సెమీస్లో బెక్నూర్ ఒజనోవ్(కజకిస్థాన్)తో విజయ్ తలపడుతాడు. మరోవైపు వేర్వేరు సెమీస్ బౌట్లలో ఓటమిపాలైన సంజిత్సింగ్, నీమా, సుమిత్ కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.