Nikhat Zareen | సోఫియా(బల్గేరియా): ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మహిళల 50కిలోల ప్రిక్వార్టర్స్ బౌట్లో నిఖత్ 3-2తో ఒయున్స్టెగ్ సుజెన్(మంగోలియా)పై గెలిచింది. ఆది నుంచే ఇద్దరు బాక్సర్లు హోరాహోరీగా తలపడ్డారు.
పదునైన పంచ్లకు సంధిస్తూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారు. అయితే తనదైన దూకుడు కనబరిచిన నిఖత్..ఆఖరికి విజేతగా నిలిచింది. 57కిలోల విభాగంలో సాక్షి చౌదరి 5-0తో సెల్మానీ చహీర(అల్జీరియా)పై గెలిచింది. మరోవైపు లవ్లీనా బొర్గోహై అనర్హతతో తొలి రౌండ్లోనే నిష్క్రమించగా, ప్రీతి పవార్(54కి) ఓటమిపాలైంది.