న్యూఢిల్లీ: అమ్మన్(జోర్డాన్) వేదికగా జరుగుతున్న ఏషియన్ ఎలైట్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల 57కిలోల ప్రిక్వార్టర్స్లో హుసామ్ 3-2 తేడాతో మునార్బెక్ (కిర్గిస్థాన్)పై అద్భుత విజయం సాధించాడు. తొలి రౌండ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హుసామ్కు.. రెండో రౌండ్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. కీలకమైన మూడో రౌండ్లో పుంజుకున్న హుసామ్.. క్లీన్పంచ్లతో కిర్గిస్థాన్ బాక్సర్పై విరుచుకుపడ్డాడు. గురువారం క్వార్టర్స్లో ఇలియాస్ (పాకిస్థాన్)తో హుసామ్ తలపడుతాడు.