హెల్సిని: భారత యువ అథ్లెట్ తేజస్ శిర్స్ 110 మీటర్ల హర్డిల్స్లో సరికొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. ఫిన్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లో భాగంగా పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ రేసును 13.41 సెకన్లలోనే పూర్తిచేసి స్వర్ణం గెలవడంతో పాటు నయా జాతీయ రికార్డు నెలకొల్పాడు. 2017లో ఈ రికార్డు (13.48 సెకన్లు) సిద్ధార్థ్ తింగల్య నమోదు చేశాడు.
అయితే పసిడి పతకం గెలిచినా తేజస్ మాత్రం పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ (13.27 సెకన్లు) మార్కుకు 0.14 సెకన్ల దూరంలో నిలిచాడు. ఇదే టోర్నీలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ.. 12.78 సెకన్లతో స్వర్ణం నెగ్గినా ఆమె కూడా పారిస్ ఒలింపిక్స్ అర్హత (12.77 సెకన్లు)కు ఒక్క సెకన్ తేడాతో మిస్ అయింది.