బార్సిలోనా: ప్రధాన స్ట్రయికర్ లాల్రెమ్సియామి హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించడంతో భారత మహిళల హాకీ జట్టు 3-0తో ఇంగ్లండ్ను చిత్తుచేసింది. స్పానిష్ హాకీ సమాఖ్య శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ టోర్నీలో భారత్కు ఇదే తొలి విజయం కాగా.. గత రెండు మ్యాచ్లను మన అమ్మాయిలు ‘డ్రా’ చేసుకున్నారు.
శనివారం జరిగిన పోరులో భారత్ తరఫున లాల్రెమ్సియామి (13వ, 17వ, 56వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో అదరగొట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచే బంతిపై పూర్తి నియంత్రణ సాధించిన మనవాళ్లు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్లో స్పెయిన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.