ఆడిలైడ్ : ఆస్ట్రేలియాలో భారత మహిళల హాకీ జట్టు తమ పర్యటనను విజయంతో ముగించింది. శనివారం ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన చివరి, అయిదో మ్యాచ్లో భారత జట్టు 2-1తో గెలుపొందింది. భారత్కు నవనీత్ కౌర్(10ని.), దీప్ గ్రేస్ ఎక్కా(25ని.) గోల్స్ సాధించగా, ఆస్ట్రేలియా-ఎ జట్టులో అబిగైల్ విల్సన్(22ని.) ఏకైక గోల్ నమోదు చేసింది. ఆస్ట్రేలియా సీనియర్ జట్టుతో సిరీస్ ఓడిన భారత జట్టు ‘ఎ’ జట్టుతో సిరీస్ను 1-1గా సమం చేసింది.