చెన్నై : జులియస్ బేర్ మహిళల ఆన్లైన్ స్పీడ్ చెస్ టోర్నీ ఫైనల్లో భారత మహిళా గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక అపజయం పాలైంది. టైటిల్ పోరులో హారిక 11-15 స్కోరుతో చైనాకు చెందిన హోవ్ ఇఫాన్ చేతిలో ఓడిపోయింది.
వెంటవెంటనే మ్యాచ్లు ఆడాల్సి రావడంతో ఫైనల్లో ఓడిపోయినట్టు, వచ్చే యేడాది మరింత సన్నద్ధతతో పోటీకి హాజరౌతానని హారిక తెలిపింది. రన్నరప్ హారికకు 4,230.77 డాలర్లు (సుమారు రూ.3,52,500) దక్కగా, విజేత ఇఫాన్ 10వేల డాలర్లు (రూ.8,33,185) చేజిక్కించుకుంది.