న్యూఢిల్లీ: ఏఎఫ్సీ మహిళల ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ రౌండ్-2లో భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు కఠినమైన డ్రా ఎదురైంది. గురువారం జరిపిన డ్రాలో గ్రూపు-సిలో భారత్.. జపాన్, వియత్నాం, ఆతిథ్య ఉజ్బెకిస్థాన్లతో తలపడాల్సి ఉంది. జపాన్ 11, వియత్నాం 33, ఉజ్బెకిస్థాన్ 50 ర్యాంక్లలో ఉండగా, భారత జట్టు ర్యాంకింగ్స్లో 61వ స్థానంలో కొనసాగుతున్నది.