చెస్టర్ లీ స్ట్రీట్: కామన్వెల్త్ గేమ్స్లో రజతం నెగ్గిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఓటమితో ప్రారంభించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన పోరులో హర్మన్ప్రీత్ బృందం 9 వికెట్ల తేడాతో ఓడింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన పోరులో మొదట భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 132 పరుగులు చేసింది. స్మృతి (23), హర్మన్ప్రీత్ కౌర్ (20), దీప్తి శర్మ (29) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. మైదానం చిత్తడిగా ఉండటంతోనే తమ జట్టు అత్యుత్తమ ఆటతీరు కనబర్చలేకపోయిందని మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ పేర్కొంది.