Asia Games | హంగ్జు(చైనా): ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్లో భారత పురుషుల వాలీబాల్ జట్టు సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3-2(25-27, 29-27, 25-22, 20-25, 17-15)తో దక్షిణకొరియాను మట్టికరిపించింది. హోరాహోరీగా సాగిన ఐదు సెట్ల పోరులో మన జట్టు అద్భుత పోరాట పటిమకనబర్చింది.
ఇప్పటికే కాంబోడియాపై 3-0తో గెలిచిన భారత్..గత ఆసియా గేమ్స్ రజత విజేత కొరియాను ఓడించడం ద్వారా గ్రూపు-సి నుంచి ఐదు పాయింట్లతో నాకౌట్కు అర్హత సాధించింది. అమిత్, అశ్వల్ రాయ్ మెరుగైన ప్రదర్శనతో భారత విజయంలో కీలకంగా వ్యవహరించారు.