న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్.. ప్రపంచ ర్యాంకింగ్స్లో తొలిసారి టాప్-100లో చోటు దక్కించుకున్నాడు. తాజాగా చెన్నై ఓపెన్ టైటిల్ నెగ్గిన నాగల్.. సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాలో టాప్-30 ప్లేయర్పై నెగ్గి సంచలనం నమోదు చేసిన విషయం తెలిసిందే.
సోమవారం విడుదలైన ఏటీపీ సింగిల్స్ ర్యాకింగ్స్లో నాగల్ 23 స్థానాలు ఎగబాకి 98వ ర్యాంక్ దక్కించుకున్నాడు. భారత్ నుంచి టాప్-100లో ప్రస్తుతం నాగల్ ఒక్కడే ఉన్నాడు. చివరిసారిగా 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత భారత్ నుంచి ఓ ఆటగాడు వందలోపు ర్యాంక్ పొందడం ఇదే తొలిసారి.