భువనేశ్వర్ : ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో ఆదివారం భారత జట్టు 5-4 తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ హ్యాట్రిక్తో జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. హర్మన్ప్రీత్ 13, 14, 55 ని.లలో గోల్స్ చేశాడు. కాగా జుగరాజ్ సింగ్(18ని.) సెల్వం కార్తి (25ని.) తతిమా గోల్స్ చేశారు.
ఆస్ట్రేలియాకు జోషువా బెల్జ్(2ని.), కి విల్లాట్(42ని.), బెన్ స్టెయిన్స్(52ని.), అరాన్ జలెస్కి(56ని.) గోల్స్ సాధించారు. ఈ సీజన్లో ఇండియాకిది ఆరో విజయం. ఇండియా తదుపరి సోమవారం జర్మనీతో, బుధవారం ఆస్ట్రేలియాతో తలపడుతుంది.