హైదరాబాద్, ఆట ప్రతినిధి: బ్యాంకాక్(థాయ్లాండ్) వేదికగా జరిగిన అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో భారత బృందం 36 పతకాలతో అదరగొట్టింది. వివిధ కేటగిరీల్లో బరిలోకి దిగిన మన ప్లేయర్లు ఏడు స్వర్ణాలు సహా పది రజతాలు, 19 కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వ్యక్తిగత పూమ్సే విభాగంతో పాటు క్యుయోర్గీలో స్వాతి రెండు రజతాలు దక్కించుకుంది. ప్రిషా పాగేకు ఒక స్వర్ణం, రెండు రజతాలు కైవసం చేసుకోగా, రభ్య పసిడితో పాటు కాంస్యం కైవసం చేసుకుంది.